17, జనవరి 2021, ఆదివారం

ధర్మం

భగవంతుడిని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడుగా కొలుస్తునే ఉన్నాం. మనం చేసే పాపపుణ్యములనుబట్టే మనకి జన్మనిస్తాడట భగవంతుడు. అన్ని జన్మలలోకి అతిగొప్పది మానవజన్మ. అంత విలువైన జన్మని మనం ఎంతవరకు సార్ధకము చేసుకుంటున్నాము? 

పంచేంద్రియాలు మనిషితోపాటు అన్ని ప్రాణులకు ఇచ్చాడు భగవంతుడు. అన్నిజీవాలు నోటిని తినడానికి మాత్రమే ఉపయోగిస్తే దానిని భగవన్నామస్మరణకి వాడే భాగ్యం మనిషికి మత్రమే ఉంది. దుర్వినియోగమే ఎక్కువ చేస్తున్నాం మనం.

మనిషికి కోరికలు అనంతం. జీవితం నీటిబుగ్గలాంటిదని తెలిసీ సుఖాలకోసం ప్రాకులాడుతాడు. చివరికి భగవంతునికి చేసే పూజకూడా స్వార్ధపూరితమైన కోరికలకోసమే చేస్తాంకదా?

**************************************************************************

కైకసి పుతృలైన రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుని అనుగ్రహంకోరి ఘోరతపస్సు చేసారట. రావణుడు వేయి సంవత్సరాల తపస్సు పూర్తికాగానే ఒకతలని పూర్ణాహుతిచేసేవాడు.  పదివేలసంవత్సరాల తర్వాత తన పదవతల కూడా ఆహుతిచేస్తుండగా, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరమని అడుగుతాడట. 

మరణమేలేని వరం ప్రసాదించమన్నాడు. అది అసాధ్యం, మరి ఏదయినకోరుకొమ్మన్నాడు బ్రహ్మదేవుడు. మనిషి తనకు గడ్డిపరకతో సమానం. దేవ, దానవ, గంధర్వాదులందరి పేర్లు చెప్పి, వారి చేతిలో మరణం ఉండకుండా వరం కోరుకున్నాడు. బ్రహ్మ తధాస్తు అని పలికి, పోయిన తొమ్మిదితలలు కూడా ఇచ్చేసి అంతర్ధానం అయ్యాడు. 

కుంభకర్ణుడు గ్రీష్మఋతువులో అగ్నిమధ్య నిలబడి, వర్షఋతువులో వానలోనూ, శిశిరఋతువులో నీటిలో నిలబడి ఘోరతపస్సు చేసాడు. వాడికి వరమీయవద్దని దేవతలందరూ బ్రహ్మని కోరగా, సరస్వతీ దేవి కుంభకర్ణుని నాలుక మీద కూర్చొని, "నిర్దయ" అని కోరుదామనుకున్న కుంభకర్ణుని నోట "నిద్ర" అని అనిపించారు దేవతలు. తధాస్తు అనేసాడు బ్రహ్మ. వాడు ఆరు మాసాల నిద్ర, ఆరు మాసాల భోజనం. అంతే. 

విభీషణుడు  కూడ ఘొరమైన తపస్సు చెసాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయినపుడు, కష్టసమయాలలోనూ తను ధర్మం తప్పకుండా ఉండేలా వరమడిగాడట.  

ముగ్గురూ వారి ప్రాప్తమును బట్టి వరాలను పొందారు. అన్ని లోకాలను జయించినా, రావణుడు చివరికి గడ్డిపోచతో సమానమని అనుకున్న మనిషి, శ్రీరాముని చేతిలో మరణంపొందాడు. కుంభకర్ణుడు నిద్రలోనె మునిగిపోయాడు. ధర్మంతో ఉన్న విభీషనుడు చిరంజీవి కాగలిగాడు. 

అంటే..దేవుడిని మన ఇస్టానుసారం వరాలు అడిగినా,  ఎవరికి ఎపుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. రమణ మహర్షి భోధనలు అర్ధం చేసుకున్నవారికి అర్ధం అవ్తుంది. తృప్తికి మించిన సంపదలేదు. భగవంతుడు ప్రసాదించిన శక్తియుక్తులను వినియోగించుకుంటూ తృప్తితో, ధర్మం తప్పక జీవనం సాగించేవారికి  ఆనందం వెన్నంటే ఉంటుంది. 

ధర్మో రక్షతి రక్షితః 

   

15, నవంబర్ 2020, ఆదివారం

యోగి (కల్పిత కధ)

సెలవులు అయిపొయాయ్. కాలేజీలు తెరుచుకున్నాయ్. అంతా హడావుడి. స్టూడెంట్స్, లెక్చరర్లు పరుగులు. అమర్ కూడా ఆలస్యం అవుతోందనుకుంటూ బండి స్టార్ట్ చేసి ఫొన్ చేతిలోకి తీసుకున్నాడు. "హే అనితా, ఏం చేస్తునావ్...హా, రెడీగా ఉండు. బస్ స్టాండ్ దగ్గర పిక్ చేసుకుంటాను" అంటూ ఫొన్ పెట్టేసి బండి కదిలించాడు.పదింటికల్లా కాలేజి చేరారు ఇద్దరు. 

అమర్ తండ్రి చాల సంవత్సరాలక్రింద ఆచార్య సన్యాసం తీసుకున్నాడు. ఆయన ఉండేది ఒక పెద్ద ఆశ్రమం. ఆయన దర్శనంకోసం భక్తులు వస్తూ ఉంటారు. అనిత తండ్రి అమర్ కి మేనమామ అవుతాడు. అనిత చాల అందమైనది. అనితను చూడగానే  అమర్ కి ముచ్చటేస్తుంది. అలా తెలిసి తెలియకనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఒకరోజు అమర్ విషయం అమ్మతో చెప్పాడు.  "అమ్మా, అనిత అంటే నాకు ప్రాణం. పెళ్ళిచేసుకోవాలని  అనుకుంటున్నా" అని చెప్పాడు.తండ్రితో ఎలాంటి సంబంధాలు లేవు. కాని భగవంతుడి స్వరూపంగా నమస్కరించి విషయం చెప్పాడు. స్వామివారి ఆశీర్వాదంతో అనిత అమర్ ల వివాహమయింది.   

చూస్తుండగానె సంవత్సరం అయింది. బాబు పుట్టాడు. మేనరికం కారణం తో బాబు శరీరం ఆరోగ్యంగా లేదు. బాబుకి ఆరు నెలల వయసు ఉన్నపుడు అమర్ వాళ్ళ అమ్మకి కాలు విరిగింది. లేవలేని పరిస్థితి.  శక్తివంచన లేకుండా అత్తగారి సేవ చేసింది అనిత. బాబుని హాస్టల్ లో వేసింది. రోజులు గడుస్తున్నాయ్. తల్లిగారి ఇంటికివెళ్ళి కూడ నాలుగేళ్ళయింది. పాపం అనిత!

అలా కొన్నేళ్ళు గాడిచాయ్. ఒకనాడు అమర్, అనిత తెలిసినవాల్ల పెళ్ళికి బండిపై వెళ్ళి వస్తున్నారు. రాత్రి ఎనిమిది అయింది. మెడలో చాల బంగారం ఉంది. ఎక్కడనుండి వచ్చారో, ఒక్కసారిగ దొగలు మీదపడ్డారు. మెడలో ఉన్నదంతా దోచుకొని అమర్ ప్రతిఘటించడంతో అతన్ని బాగ కొట్టారు.  అమర్ ని హాస్పిటలో చేర్పించారు. ట్రీట్మెంట్ పూర్తిచేసుకొని ఇంటికివచ్చారు, కాని అమర్ అనిత తో సుఖంగా ఉండలేకపోయాడు. తను సంసార జీవితానికి ఇక పనికిరాడని అమర్ కి అర్ధమయింది. పెళ్ళి తర్వాత కష్టాల ఊబిలో ఉన్న అనిత కి ఈ విషయం శరాఘాతంలా తాకింది. జీవితం చీకటిపడిపోయింది. 

కొంతకాలం అయింది. ఆచార్య స్వామి సమాధి కావడానికి సిద్ధమయారు. స్వామి తర్వాత ఆ పీఠంపై కూర్చునేవాళ్ళు ఎవరు? అపుడు అమర్ భార్యతో అలోచించాడు. మన జీవితంలో ఆనందం ముగిసింది. కనీసం ఆశ్రమాన్ని కాపాడుకుందాం అన్నాడు. సరే అంది అనిత. 

పరోపకారం ఇదం శరీరం. శరీరం మానవులకు ఉపయోగపడాలి.  సన్యాసం అంటే మాటలు కావు. గోచి తప్ప ఖరీదయిన బట్టలు, అలంకారాలు ఉండవ్. ఎండకి, వానకి, చలికి ఆ శరీరం అలవాటు పడిపోవాలి.  ఒక్కపూట పిడికెడు అన్నం బిక్ష తెచ్చుకొని తినాలి. రాత్రి కందమూలాలో,పండ్లో. అంతే! నిరంతర దైవ ధ్యానమే తప్ప వేరే అలోచన రాకూడదు. 

అమర్ రెండు సంవత్సరాలు కఠిన సాధన చేసి భార్య భిక్షతో అమరేంద్ర యోగి అయ్యాడు. భార్య కూడా అదే ఆశ్రమంలో స్వామి సేవ చేసుకుంటూ యోగినిలా ఉండిపోయింది. ఇపుడు ఆ స్వామి మహిమలు చిన్నవి కావు. ఆయ్న నోటివెంట ఏదివస్తే అది జరిగిపోతుంది.  

ఇది విధిలిఖితం. భగవతుడు ఎవరి జీవితాలు ఎటు తిప్పుతాడో. జై అమరేంద్రస్వామి!    

8, నవంబర్ 2020, ఆదివారం

మారుతున్న కాలాలు

నేను పెద్దగా చదువుకోలేదు. కాని చూస్తున నేరాలను చూసి రాయలనిపించింది. 


ఒకప్పటి కాలానికి ఇప్పటికాలానికి తేడా కారణం - పాపం.

ధర్మదేవత ఒంటికాలితో పోరాడుతోంది. అందుకే కరొనాలు, తూఫానులు. ఎందుకు, ఎందుకు మనుషులలో ఇంత అరాచకం? పోయేటపుడు జానెడు బట్టకూడా మనతో రాదె? మహా అయితే 50,60 యేళ్ళు బ్రతకడానికి ఇన్ని చేయాలా? 

 అప్పట్లో ఆ కాలంలో డబ్బులేకపోయిన పచ్చని పొలాలు కలుషితంలేని పాలు పెరుగు, ఎరువులు  లేని పంట, కూరగాయలు...ఎంత బావుండేదో.

ఏ కోరికలు లేవు. హాయిగా కడుపునిండా తిని కమ్మటి నిద్ర పోయేవాళ్ళం.ఇపుడు డబ్బు డబ్బు డబ్బు. ఎలాగైన సంపాదించాలి. చదువుకున్నవాడు అమెరికా వెళ్ళి కోట్లు సంపాదించాలి.కారు బంగళా విలాసవంతమయిన జీవితం కావాలి. అమ్మ నాన్న చనిపోయినా వచ్చి చూసే తీరిక లేనివాళ్ళు ఉన్నారు. అంతడబ్బు సంపాదించినా ఒంట్లో రోగాలే, నిద్రపోలేడు, తిండితినలేడు. కారణం తినేదంత విషపూరితమైన ఆహారమేగా.   

ఇక చదువులేనివాడు. వీడికి విలాసాలు కావాలి. దానికి ఉన్నవాణ్ణి దోచుకోవాలి, లేదా చంపాలి, నరకాలి.  ఏమైన సరె డబ్బుకావాలి. అది పాపమా అనే అలోచన కూడా రాదు.ఒకరిని ఒకరు మోసం చేసుకోడం.ప్రేమలు లేవు. దారుణం. 

ఆకాలం లో మా నాన్న పొలం దగ్గరికి వెళ్ళేవాళ్ళం. పచ్చని పొలంలో మంచం వేసుకొని పడుకునేవాళ్ళం. హాయిగా ఇంటిబయట చల్లనిగాలికి సేదతీరేవాళ్ళం. కాని ఇపుడు ధైర్యంగ పడుకోగలిగెవాళ్ళెవరు?  

మా అమ్మవాళ్ళు ఐదుగురు అక్కచెల్లెళ్ళు. ముగ్గురు అన్నదమ్ములు. ఆరునెలలకొకసారి అందరు కలిసేవాళ్ళం. కలిసి వండుకొనితిని అనందంగా మాట్లాడుకొనేవాళ్ళం. అన్నలు ఇచ్చే ఆడపిల్ల కట్నం యాభైరూపయలిస్తే సంతోషంగా తీస్కొని ఇంటికొచేవాళ్ళం. ఇపుడు నెను వెళితే నాకేం వస్తుంది. వాళ్ళు వస్తే ఏం తెస్తారు. అదీ అలోచన. అప్పటి ఆలొచన, ఆరొగ్యం గురించి అలోచించండి. మంచితనం అలవర్చుకోండి. ధర్మాన్ని పాటించండి. మనసు నిర్మలంగా ఉంచుకోండి. కాలుష్యం పారద్రోలండి. 

7, నవంబర్ 2020, శనివారం

విధివ్రాత



అది మాధవాపురం. ఒక చిన్న పల్లెటూరు. నూటయాభయి గడపలు. పచ్చని పొలాలు. చూస్తేనే ఆనందం!


ఆ కాలంలోనె కరణం వారి ఇళ్ళు చూస్తె మతిపోతుంది.డూప్లెక్సు బంగళా.  పేద్ద వాకిలి. సరస్వతమ్మ అంటేనే శాస్త్రాలు గుర్తొస్తాయి. మెట్లకింద పిల్లలు ఆడుకునే చిన్న రూము అంటే చుట్టుపక్కల పిల్లలకి ఎంతో ఇస్టం ఉండేది. బంగళా పక్కనే ఒక పెద్ద బురుజు. బురుజు కింద మైసమ్మ. ప్రతి సంవత్సరం మైసమ్మ జాతర బైండ్లోడు వస్తాడు. సిగాలూగడం ఊరిజనాల  హడావిడి ఎంత బాగ ఉంటుందో. ఆ జాతరలో జిలేబిలు కొనుక్కు తినడం కోసం పిల్లలు ఆరాటపడెవాళ్ళు. మగవాళ్ళు ఆడవేషాలతో డాన్సులు వెయడం. అసలు ఆ ఊరి జాతర కళనే వేరు. 


"యేం. బాగున్నవా?" అడిగాడు వెంకటెశ్వర శర్మ, వాల్ల ఇంటి పక్కింట్లో ఉండే బ్రాహ్మడు యాత్తర్లకెళ్ళి వస్తూ అడిగాడు. "ఆ యేం బాగుండడంలే. కనబడడం లేదా" అందామె. సూటిగా సమాధానం చెప్పదుకదా!.


సరస్వతమ్మకి కరణంకి ముగ్గురు ఆడపిల్లలు. ఒక్కగానొక్క కొడుకు, శివ. చాల గారబంగా పెంచారు. వెంకటెశ్వర శర్మ కొడుకు రాము, శివ ఇద్దరు ఒకే క్లాస్ లో చదివారు. 


ఒకనాడు కరణం పెళ్ళిల్ల పేరయ్యని పిలిపించాడు. కూతుర్లు అరుణ, కమల, బుజ్జికి సంబంధాలు చూడాలి. 

పేరయ్య "పక్కనే తుర్కపల్లి లో చక్కని సంబంధం ఉంది. మీరేమంటారు దొరా" అని సంబంధం విషయాలు అన్నీ చెప్పాడు.

"మంచిది. పిల్లని చూడడానికి రమ్మనండి మరి" అన్నడు కరణం.


అలా అరుణకి, కమలకి పెళ్ళిళ్ళు అయిపొయాయ్. చూస్తుండగానె అరుణకి నలుగురు సంతానం. ఆనందంగా సాగుతున్న సంసారం చూసి కరణం, సరస్వతమ్మ చాల సంతోషించేవాళ్ళు.


"మన శివకి బుజ్జి కి కూడా పెళ్ళిళ్ళు చేద్దామండి. మన వయసు యాభయి దాటింది.  ఇంక ఆలస్యం మంచిది కాదు" అంది సరస్వతమ్మ. 

వనపర్తి నుండి బుజ్జికి, దాచారం నుండి శివ కి మంచి సంబంధాలు వచ్చాయ్. ఆలస్యం చేయకుండ అపెళ్ళిళ్ళు చేసేసాడు కరణం. శివకి తన భార్య రమణమ్మ తో ఇద్దరు మగపిల్లలు. కన్ని, చిట్టి అని ముద్దుగా పిలుచుకునే వాళ్ళు. ఎపుడూ ఆ ఇళ్ళు కూతుర్లు, అల్లుళ్ళు, పిల్లలతో కళకళలాడుతూ ఉంటే ఊర్లో వాళ్ళకి అదొక భూతలస్వర్గం లా కనబడేది. 


ఒకరోజు సడన్ గా హార్ట్ అటాక్ తో కరణం చనిపోయాడు. సరస్వతమ్మకి కష్టాలు మొదలయ్యయి.

ఆరోజు మంగళవారం. అరుణ పెద్దకూతురు విజయతో కలిసి పెరట్లో తోటకూర కోస్తుంది సరస్వతమ్మ. శివ భార్య రమణమ్మ తన పిల్లలకి స్నానంపోస్తుంది. అపుడే పిడుగులాంటి వార్త. తనరెండొకూతురు కమల ఇంటిపని చేస్తు, గచ్చులో జారిపడి చనిపొయిందని. సరస్వతమ్మ కుప్పకూలిపొయింది. కొద్దిసేపట్లోనే మరొకవార్త. బుజ్జి నీటిలో పడి చనిపోయింది అని. ఒకేరొజు రెండు పిడుగులాంటి వార్తలని ఎలా జీర్ణించుకోవాలో కూడ అలోచించే స్థితిలో లేదు సరస్వతమ్మ. 


వనపర్తికి వెళ్ళేసరికి వాకిట్లో శవాన్ని పడుకోబెట్టారు. నీళ్ళుమింగి ఆ దేహం ఉబ్బిపోయి ఉంది. కనీసం యేర్పాట్లు చూడడానికి కూడా ఎవరు లేరు. సరస్వతమ్మ భోరున ఎడుస్తూ కుప్పకూలిపొయింది. లోపల టీ తాగుతూ కూర్చున్న బుజ్జి భర్తని చూసి వెంకటేశ్వర శర్మ కోపం ఆపుకోలేకపోయాడు. గొడవపెట్టాడు. "మా బుజ్జి ని చంపేసారు" అంటూ అరుస్తున్నాడు.  


బుజ్జి పక్కన కూర్చున్నాడు శివ. ఏం తోచట్లేదు. బిత్తరచూపులు చూస్తున్నాడు. మెల్లిగా ఆపెదాలమీద చిరునవ్వు వచ్చింది. అది వెర్రినవ్వులలాగ మారిపొయింది. "రా బుజ్జి. మన ఊరెల్దాం పద. మాధవాపురం వెళ్ళి మన ఇంటి మెట్లకింద ఆడుకుందం పద. లెవ్వు. పద" అంటూ లేపుతున్నాడు ఆ శవాన్ని. పక్కన కూర్చున్న భార్య రమణమ్మ "ఏమైందండి? ఎందుకల మాటాడుతున్నారు" అని దగ్గరకి వచ్చింది. "హెయ్.. జరుగు. నా చెళ్ళితో మాట్లాదుతుంటే నువ్వెవరు మధ్యలో. చంపేస్తా" అంటూ అరుస్తున్నాడు. బలవంతంగా శివ ని పట్టుకొని, బుజ్జి కి అంతిమ సంస్కారాలు చెసేసారు. 


"పాపం. శివ కి బుజ్జి దయ్యమై పట్టింది" అనుకునెవాళ్ళు ఊరివాళ్ళు. శివ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. పిల్లల్ని, రమణమ్మని, అమ్మని ఇస్తం వచినట్లు కొట్టడం, బట్టలిప్పుకొని తిరగడం, బంగళాపైకి వెళ్ళి చెల్లితో ముచ్చటపెట్టడం. వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఎవరైన అన్నం పెట్టమని అడగడం పెడితే తినడం. డిగ్రీ చదివిన శివ వరుస బిచ్చగాడిలా అయింది.


సరస్వతమ్మ బ్రతుకు ఘోరమయింది. ఆ బాధ భరించలేక కోడలు పిల్లలని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ కొడుకుతో సరస్వతమ్మ అంతపెద్ద బంగళాలో ఉండడం నరకప్రాయమయింది. 

రాత్రి అయితే మెట్లపై గలగలా గజ్జెల శబ్దం వినబడేది. నీడలా ఒక ఆకారం పరుగుపరుగున వచ్చి మాయమయ్యేది. అది చూసినవాళ్ళు విన్నవాళ్ళు భయంతో వణికిపోయేవాళ్ళు. అందరూ బురుజు నీడ మీ ఇంటిమీద పడి ఇలా అయింది వాస్తు దోషం అనేవాళ్ళు. 


ఒకనాడు సరస్వతమ్మ అరుణ దగ్గరికి వెళ్ళింది. అక్కడే ఆమె జీవితం ముగిసింది పాపం. 


కాలచక్రం తిరుగుతోంది. శివ పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. అపుడపుడూ వచ్చి శివకి స్నానం పోసి కొత్తబట్టలు వేసి అన్నం పెట్టి వెళ్తారు. పాపం, శివకి వాళ్ళు కొడుకులు అనికూడా తెలీదు.


ఒకనాడు కళకళలాడిన బంగళా ఇపుడు దీనస్థితికి చేరుకుంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటారు. ఇదేనేమో మరి. ఇది భగవంతుడు ఆడే ఆట.